అందాల ముద్దు గుమ్మ నిత్యా మీనన్, నాని హీరో గా తెరకెక్కిన అలా మొదలైంది సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ బ్యూటీకి తెలుగునాట క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక సినిమాల్లో నటించిన నిత్య మీనన్ కు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే సత్యదేవ్ రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రలో తెరకెక్కిన స్కైలబ్ సినిమాలో కూడా నిత్యా మీనన్ ప్రముఖ పాత్రలో నటించింది. ఈ సినిమాలో నిత్యా మీనన్ నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది.  కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ ల దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతుంది.

 అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిత్యా మీనన్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. నిత్యా మీనన్ మాట్లాడుతూ... తనకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైనా కొన్ని చేదు అనుభవాల గురించి తెలియజేసింది... నాకు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దెబ్బ తగిలింది,  ప్రభాస్ విషయంలోని.. ఆ ఇష్యూ నన్ను ఇప్పటికీ మానసికంగా బాధపెట్టింది. నా గురించి జర్నలిస్ట్స్ అలా రాయడం తో చాలా హర్ట్ అయ్యాను. అలా మొదలైంది సినిమా విడుదలైనప్పుడు నేను  చిన్నదాన్ని, నేను అప్పుడే కొత్తగా వచ్చాను. అలా మొదలైంది ఫస్ట్ సినిమా. నాకు సరిగ్గా తెలుగు రాదు, తెలుగు సినిమా లను కూడా చూడలేదు. అలాంటి సందర్భం లోనే నన్ను ప్రభాస్ గురించి అడిగారు, నాకు తెలియదు అని చెప్పాను. ఈ విషయాన్ని చాలా పెద్దది చేశారు. నేను ఏదో చాలా పెద్ద తప్పు చేసినట్టు న్యూస్ ను క్రియేట్ చేశారు. ఆ ఇష్యూ తో హానెస్ట్ గా అన్ని చోట్లు ఉండకూడదని.. ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని..  మాటల గారడీ చేస్తేనే నచ్చుతుందని అర్థమైందని..  అక్కడ ఉన్న మీడియా వాళ్లకు కూడా తెలుసు నాకు తెలుగు రాదని..  ప్రభాస్ ఎవరో తెలియదని.. అందుకే నన్ను కావాలని అడిగారు..  నాకు తెలియదు కాబట్టి తెలియదని చెప్పేశా..  ఆ విషయాన్ని పెద్దది చేశారు..  దీంతో చాలా బాధపడ్డాను అని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: