ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప ది రైజ్ ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ సాధించిన విషయం తెల్సిందే. సుకుమార్ తీసిన ఈ యాక్షన్, మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో అల్లు అర్జున్ పుష్పరాజు అనే పాత్ర చేయగా శ్రీవల్లి పాత్రలో యువ భామ రష్మిక మందన్న నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి క్యూబా కెమెరా మ్యాన్ గా వ్యవహరించడం జరిగింది. తెలుగు సహా రిలీజ్ అయిన మిగతా అన్ని భాషల్లో మంచి కలెక్షన్ సొంతం చేసుకుని నిర్మాతలతో పాటు బయ్యర్స్ కి కూడా లాభాలు తెచ్చిపెట్టింది పుష్ప.

ఇక ఈ సినిమా మేనియా ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ సినిమాలోని పలు సాంగ్స్, సీన్స్, డైలాగ్స్ ని ఎందరో ప్రేక్షకాభిమానులతో పటు పలువురు సెలెబ్రిటీస్ సైతం ఇమిటేట్ చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అందరిలో మంచి ముద్ర వేసిన పుష్పలో సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రిలీజ్ అయిన సాంగ్స్ లో సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీవల్లి సాంగ్ అయితే మరింతగా పాపులారిటీ దక్కించుకుంది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ పాడిన సిద్ శ్రీరామ్ ని అభినందించిన అల్లు అర్జున్, నేడు కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా మరొకసారి ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసారు.

వాస్తవానికి శ్రీవల్లి సాంగ్ ని తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్ శ్రీరామ్ ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సంగీత వాయిద్యాల సహాయం లేకుండా కేవలం తన అద్భుత గాత్రంతో ఆలపించి అక్కడి వారందరినీ ఎంతో అలరించారు. అప్పుడే నాకు అర్ధం అయింది, ఆయనకు ప్రత్యేకంగా మ్యూజిక్ అవసరం లేదు, ఎందుకంటే ఆయనలోనే సంగీతం ఉంది అని భావించానని సిద్ శ్రీరామ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు బన్నీ. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పెట్టిన ఈ పోస్ట్ పై పలువురు ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు సిద్ శ్రీరామ్ అభిమానులు సైతం మీరు నిజంగా సూపర్ బన్నీ గారు అంటూ ఆయన గొప్ప మనసు పై అభినందనలు తెలియచేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: