సినీ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలకు కొదవ లేదు. ఆ ఇండస్ట్రీ , ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీలలో ప్రేమ వ్యవహారాల కబుర్లు కోకొల్లలుగా వస్తున్నాయి. ఈ ప్రేమ వ్యవహారాల్లో గాసిప్స్ ఎన్ని ఉన్నాయో అనేది కూడా తెలియదు. ఒకవేళ ప్రేమ వ్యవహారాలు గురించి తెలిసిన వాటిని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లే సత్తా కూడా చాలా మందికి లేదు. ఒక వేళ ప్రేమలో ముదిరిపోయి పెళ్లి చేసుకున్న అది కూడా మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతున్న రోజులివి. కానీ ఈ హీరోయిన్ లవ్ లో ఫెయిల్ అయ్యి కెరీర్ పరంగా స్టార్ హోదా అందుకుంది, ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ తెలుసా ! 

వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పేరు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్  స్టార్ హీరో శరత్ కుమార్ గారాల పట్టి అయిన ఈమె చిన్నతనంలోనే సినిమా రంగం మీద ఆసక్తి పెంచుకొని నటన  మీద గురి ఏర్పర్చుకున్నారు పరిస్థితులు అనుకూలించక కొంత కాలం పరిశ్రమకు దూరంగా ఉన్న ఆ తర్వాత నటన వైపు వచ్చి కేవలం హీరోయిన్ రోల్స్ కె పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రల్లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి మక్కల్ సెల్వి బిరుదును సొంతం చేసుకున్నారు. 



వరలక్ష్మి ఇంగ్లాండ్ లోని ప్రముఖ ఏడింబర్గ్ యూనివర్సిటీ లో బిజినెస్ మనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేసి ముంబైలో నటన లో శిక్షణ పూర్తి చేసిన తండ్రి శరత్ కుమార్ సలహాలతో నటిగా మెరుగుపడ్డారు. 18 ఏళ్ల వయస్సు లోనే శంకర్ దర్శకత్వంలో బాయిస్ చిత్రం లో హీరోయిన్ అవకాశం వచ్చినప్పటికీ తండ్రి సలహా మేరకు తిరస్కరించారు. అవే కాకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వచ్చినప్పటికీ నిరాకరించారు. 



2012లో శింబు చిత్రం పోడా పొడి హీరోయిన్ గా కోలీవుడ్ లో అడుగుపెట్టిన వరలక్ష్మి తన తొలి చిత్రంతో నే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కానీ ఆ చిత్రం పరాజయం పాలైంది. తన రెండో చిత్రం విశాల్ తో నటిస్తున్న సమయంలోనే అతనితో పీకల్లోతు ప్రేమలో పడి జంట పక్షుల్లా విహరిస్తూ ఉన్న సమయంలోనే వీరిద్దరి ప్రేమ వ్యవహారం కోలీవుడ్ మీడియా లో బహిర్గతం కావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. 

విశాల్ , వరలక్ష్మి ప్రేమకు విశాల్ కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మాత్రం ఒప్పుకోలేదు. శరత్ కుమార్ కు ఇష్టం లేకున్నా విశాల్ తో తన ప్రేమను కొంత కాలం కొనసాగించిన తర్వాత నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ , శరత్ కుమార్ మధ్య వచ్చిన వివాదం చెలరేగిన తర్వాత వీరిద్దరి మధ్య దూరం పెరగడం మొదలై విడిపోయినప్పటికీ స్నేహితులు గా మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నారు. అందుకు ఉదాహరణ వీరిద్దరూ విడిపోయిన తర్వాత వచ్చిన పందెం కోడి 2 చిత్రం. 




విశాల్ తో లవ్ బ్రేకప్ అయిన తర్వాత కెరీర్ మీద దృష్టి సారించిన వరలక్ష్మి ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూనే తనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ తన తరం హీరోయిన్స్ కంటే భిన్నంగా సినీ ప్రయాణం చేస్తున్నారు. కేవలం కోలీవుడ్ కె పరిమితం కాకుండా టాలీవుడ్, శాండిల్ వుడ్ , మాలీవుడ్ లలో సైతం నటిస్తూ అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంది.  



వరలక్ష్మి మన టాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు, ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాల్లో క్రాక్, నాంది వంటి చిత్రాలు ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం వరలక్ష్మి పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగు లో సమంత కీలక పాత్రలో నటిస్తున్న యశోదా చిత్రంతో పాటుగా బాలకృష్ణ గోపిచంద్ మలినేని చిత్రంలో కూడా నటిస్తున్నారు అని పరిశ్రమ వర్గాలు నుండి టాక్ 

మరింత సమాచారం తెలుసుకోండి: