పవన్
కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా తన సినిమాల విషయంలో భారీ స్థాయిలో స్పీడు పెంచాడు.
పార్టీ కార్యకలాపాల కారణంగా మూడేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఆయన. అయితే గత ఎన్నికలలో సరైన ఫలితం లేకపోవడంతో ఆయన మళ్లీ
సినిమా చేసే విధంగా ముందుకు వెళ్ళాడు. అలా
పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించింది.
లేటుగా వచ్చినా కూడా పవన్
కళ్యాణ్ క్రేజ్ ను ఏమాత్రం తగ్గింపు లేదని మరొకసారి ఆయన అభిమానులు నిరూపించారు. ఇదే ఉత్సాహంతో ఆయన వరుసగా నాలుగు సినిమాలను ఓకే చేశాడు. ఆ విధంగా ఇటీవల ఆయన భీమ్లా
నాయక్ సినిమాతో థియేటర్లలో సందడి చేసి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. థియేటర్ల వద్ద ఫాన్స్ పూనకాలతో ఈ
సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఎక్కడ చూసినా ఈ సినిమానే హల్చల్ చేస్తుంది.
అయితే ఈ
సక్సెస్ లో ఉన్న
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ తాజాగా మరో
రీమేక్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ
సినిమా ప్రేక్షకులను ముఖ్యంగా పవన్ అభిమానులను భారీ స్థాయిలో అలరిస్తుంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది చిత్ర యూనిట్.
సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నారు.
త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకి గాను మొత్తం ఇరవై రోజుల డేట్లు కేటాయించటం. అందుకోసం ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ ఆయన డిమాండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇరవై రోజుల కోసం అన్ని కోట్ల భారీ పారితోషికం అంటే నిజంగా ఆలోచించాల్సిన విషయమే. కానీ మేకర్స్ మొత్తం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ను క్రిష్ దర్శకత్వంలో నీ హరిహర వీర మల్లు
సినిమా తర్వాత చేయబోతున్నారు. హరీష్ శకర్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనీ సినిమాలు కూడా ఉన్న విషయం తెలిసిందే.