పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. దగ్గుబాటి రానా మరొక కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటించారు. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం పవన్ చేస్తున్న భారీ మూవీ హరిహర వీరమల్లు.

హృద్యమైన చిత్రాలను తీయడంలో అందెవేసిన చేయి అయిన క్రిష్ జగర్లమూడి తీస్తున్న ఈ సినిమాలో వీరమల్లు అనే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. గత ఏడాది పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకుంది. పవన్ కళ్యాణ్ కి జోడీగా యువ భామ నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి కీలక పాత్ర చేస్తున్నట్లు టాక్. అర్జున్ రామ్ పాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ వంటి ముఖ్య నటులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల కొంతవరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ మూవీ యొక్క ఆడియో రైట్స్ ని ప్రముఖ సంస్థ టిప్స్ వారు అత్యధిక ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని కథ, కథనాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయని, ఆ విధంగా ఎంతో అద్భుతంగా దర్శకుడు క్రిష్ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఎంతో భారీగా నిర్మిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.  మరి తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ తీస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అనే మరికొన్ని నెలల వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: