వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని సక్సెస్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను మెగా సూర్య ప్రొడక్షన్ లో ఏ ఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ జాక్వేలిన్ ఫెర్నాండెజ్ కూడా మరొక కీలక పాత్రలో కనిపించబోతుంది.

పీరియాడిక్ డ్రామా వస్తున్న ఈ సినిమా గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లగా కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. పవన్ కూడా ఈ సినిమాపై ఫోకస్ పెట్టడంతో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇప్పుడు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారడంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. పవన్ సైతం త్వరగా పూర్తి చేసి తదుపరి వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేస్తుండగా దీనిని దసరా పండుగ కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా భీమ్లా నాయక్ షూటింగ్  కారణంగా ఈ చిత్రాన్ని అప్పటికి వాయిదా వేశారు. షూటింగ్ వేగంగా చేసినా కూడా మిగతా పనులు కాకపోవచ్చు అనే కారణంతో ఏప్రియల్ లో రావాల్సిన సినిమాను వాయిదా చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ పవన్ అభిమానులు మాత్రం ఈ అప్డేట్ కి ఎంతగానో ఆనందపడుతున్నారు. అద్భుతమైన విజువల్స్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇందులో వజ్రాల దొంగ పాత్రలో కనిపించబోతున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలులు కుతుబ్ షాహీ ల సామ్రాజ్యంల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: