వకీల్ సాబ్, భీమ్లా
నాయక్ వంటి సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని
సక్సెస్ లో ఉన్న
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ
సినిమా ను మెగా
సూర్య ప్రొడక్షన్ లో ఏ ఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా
బాలీవుడ్ టాప్
హీరోయిన్ జాక్వేలిన్ ఫెర్నాండెజ్ కూడా మరొక కీలక పాత్రలో కనిపించబోతుంది.
పీరియాడిక్ డ్రామా వస్తున్న ఈ
సినిమా గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లగా కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. పవన్ కూడా ఈ సినిమాపై ఫోకస్ పెట్టడంతో ఈ
సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇప్పుడు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారడంతో ఈ
సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. పవన్ సైతం త్వరగా పూర్తి చేసి తదుపరి వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేస్తుండగా దీనిని
దసరా పండుగ కానుకగా
అక్టోబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
వాస్తవానికి ఈ
సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా భీమ్లా
నాయక్ షూటింగ్ కారణంగా ఈ చిత్రాన్ని అప్పటికి వాయిదా వేశారు. షూటింగ్ వేగంగా చేసినా కూడా మిగతా పనులు కాకపోవచ్చు అనే కారణంతో ఏప్రియల్ లో రావాల్సిన సినిమాను వాయిదా చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ పవన్ అభిమానులు మాత్రం ఈ అప్డేట్ కి ఎంతగానో ఆనందపడుతున్నారు. అద్భుతమైన విజువల్స్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయని అంటున్నారు. పవన్
కళ్యాణ్ ఇందులో వజ్రాల
దొంగ పాత్రలో కనిపించబోతున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలులు కుతుబ్ షాహీ ల సామ్రాజ్యంల నేపథ్యంలో ఈ
సినిమా రూపొందుతుంది.