సమంత-నాగ చైతన్యలు విడాకులు తీసుకున్న విషయాన్ని ఇంకా కొంత మంది నమ్మలేకున్నారు..కానీ వారిద్దరు కొన్ని మనస్పర్థలు కారణంగా విడిపోయి ఇప్పుడు ఎవరి లైఫ్ వారిది అని సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.అయితే వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. దాంతో ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి.. ఇప్పుడు చైతన్య గురించి ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కోడుతుంది. టాలివుడ్ లోని మరో టాప్ హిరోయిన్ తో చైతూ ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి..అంతేకాదు త్వరలోనే వీరిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.


ఆమె కోసం జూబ్లిహిల్స్ లో ఓ విల్లాను కూడా కొన్నట్లు సమాచారం.ఓ కొత్త విల్లా కూడా తీసుకున్నాడని, ఆ ఇంటి పునరుద్దరణ పనులను జయభేరీ సంస్థ చేస్తోందని, ఇక చైతు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న ఆమె కూడా ఒక హీరోయినే అని తేలింది.ఇంతకీ చైతు మనసు దోచిన ఆ హీరోయిన్ ఎవరూ అనేది చర్చనీయాంశంగా మారింది..అయితే ప్రస్తుతం చైతూ ప్లాటులో ఫిదా ఫెమ్ హీరోయిన్ సాయి పల్లవి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.చైతు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ 'సాయి పల్లవి' అని తెలుస్తోంది.సాయి పల్లవి షూట్ ఉంటేనే హైదరాబాద్ వస్తుంది. కానీ.. ఆమె గత కొన్ని నెలలుగా పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయింది..


ఆమె అలా ఉండటం పై వస్తున్న రూమర్స్ నిజమని అందరు అభిప్రాయ పడుతున్నారు..వీరిద్దరు కలిసి లవ్ స్టోరీ సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ నుంచే వీరిద్దరికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అందరు అనుకుంటున్నారు..సమంతతో విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. వీరి విషయం సమంతకు తెలిసినప్పటి నుంచే సామ్-చైతు ల మధ్య విభేదాలు వచ్చాయని దాంతోనే ఇద్దరు విడిపోయారని తెలుస్తుంది.ఇప్పుడు చైతుతో సాయి పల్లవి ప్రేమాయణం నడుస్తోంది. మరి ఈ జంట అయినా ఎక్కువ కాలం కలిసి ఉండాలని.. వీరిద్దరూ త్వరలో పెళ్లితో ఏకం అవుతారని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో వీరిద్దరికి పెళ్ళి జరుగుతుందని , అందుకే సాయి పల్లవి పెద్దగా సినిమాలను చేయలేదని తెలుస్తుంది.. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: