టాలీవుడ్ ఇండస్ట్రీ  క్రేజీ హీరోల్లో ఒకరు అయిన మాస్ మహారాజా రవితేజ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ హీరోగా ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల పాటు వరుస పరాజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటున్న సమయంలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని రవితేజ అందుకున్నాడు. 

క్రాక్ మూవీ విజయం తో  ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఆ తరువాత ఖిలాడి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరొక అపజయానికి ఎదుర్కొన్నాడు.  ఇదిలా ఉంటే రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ ,  ధమాకా ,  రావణాసుర ,  టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో నటిస్తున్నాడు.  తాజాగా రవితేజ మరొక సినిమాను కూడా లైన్ లో పెట్టబోతున్నట్లు ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.  

అసలు విషయంలోకి వెళితే...  మాస్ మహారాజా రవితేజ , సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.  ఇది వరకే రవితేజ , సంపత్ నంది కాంబినేషన్ లో బెంగాల్ టైగర్ సినిమా తెరకెక్కింది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.  మరొక సారి ఈ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతునట్లు తెలుస్తుంది.  సంపత్ నంది కూడా సీటి మార్ సినిమాతో మంచి సక్సెస్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం ఫుల్  ఫామ్ లో  ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: