హీరోగా నటుడిగా పలు తెలుగు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. అంతకు ముందు తమిళంలో ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో నే తెలుగులో కూడా ఆయన రాణించటానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో విలన్ పాత్రలు కూడా చేయాల్సి వచ్చింది. అలా ఇటీవల వారియర్ సినిమాలో విలన్ గా నటించిన ఆది పినిశెట్టి తన సినిమా కెరియర్ గురించి ఈ సినిమా విశేషాల గురించి వెల్లడించారు.

 ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.  అంతకు ముందు సరైనోడు అజ్ఞాతవాసి సినిమాలు చేసిన తర్వాత ఈ చిత్రంలో విలన్ పాత్రను చేయడం ఎంతో ఛాలెంజింగ్ అనిపించింది అని చెప్పారు. ఈ సినిమాకు ఎంతో ఇష్ట పడి పని చేశాను ఆయన వెల్లడించారు. గురు పాత్రకు సంబంధించి చాలా డౌట్లు ఉండేవి.. అవన్నీ దర్శకుడు క్లియర్ చేసి అంత బాగున్న తర్వాతనే ఈ సినిమాకు ఒప్పుకున్నానని ఆయన చెప్పారు. ఇక భవిష్యత్తులో కూడా ప్రేక్షకులను అలరించే పాత్రలే చేస్తానని ఆయన అంటున్నారు.

అయితే చాలా మంది తనను తమిళ నటుడిని అనుకుంటున్నారని తమిళంలో తెలుగు వాడు అనుకుంటున్నారని చెప్పాడు. తమిళం లో గాని అటు తెలుగులో కానీ రెండు భాషలలో కూడా ఆయన కు గొప్ప గుర్తింపు లేదని చెప్పాలి. అయినా మంచి మార్కెట్ తో ఆయన తన కెరియర్ను కొనసాగిస్తున్నాడు. మరి భవిష్యత్తులో ఆయన ప్రేక్షకులను పై తన ముద్ర ఉండేలాంటి సినిమాలు చేస్తాడా అనేది చూడాలి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్రీమింగ్ అవుతుంది. దీనికి ఆయనకు మంచి పేరు వచ్చిందని చెప్పాలి. భవిష్యత్తులో ఈ హీరో ఎలాంటి పాత్రతో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: