యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కిన కే జి ఎఫ్ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై మొదటి నుండే సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించడం మాత్రమే కాకుండా దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర సాధించి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతం అందించాడు. ఈ మూవీ కి రవి బుస్రుర్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇలా థియేటర్ లలో అద్భుతమైన విజయం సాధించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కొంత కాలం క్రితం నుండే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 

'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. థియేటర్ లలో , 'ఓ టి టి' లో ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యింది. ఈ మూవీ జీ తెలుగు ఛానల్ లో ఈ రోజు అనగా ఆగస్ట్ 21 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు మొట్ట మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం కాబోతోంది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: