ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజీ ను సంపాదించు కున్నాడు . ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది . మరి కొన్ని రోజుల్లో అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే పుష్ప ది రూల్ మూవీ తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాకు సంబంధించిన ప్రణాళికలను ఇప్పటి నుండే వేసుకున్నట్లు తెలుస్తుంది.

పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరి కొన్ని రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమాను తెరకెక్కించ బోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ ప్రారంభం కాబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ వార్త ఎంతవ రకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇది వరకే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి ,  అలా వైకుంఠపురంలో మూడు మూవీ లు తెరకెక్కయి. ఈ మూడు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించాయి. ఇప్పటికే మూడు మూవీ లు తెరకెక్కిన వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగవ సినిమా కూడా తిరక్కబోయే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: