మొత్తం తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్ సమంత టాప్ పొజిషన్ లో ఉంది.. ఆమె తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్టుల్లో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పర్చుకుంది.ఇకపోతే ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. అంతేకాకుండా విజయ్ తో చేస్తున్న ఖుషి మూవీ షూటింగ్ లో ఉంది.. ఈ తరుణంలోనే సమంత బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం ముంబైలో ఒక ఇంటిని కూడా తీసుకుందట.. అయితే సమంత ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లో ఆమెకు తెలుగు భాష రాదు.
దీంతో తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే సామర్థ్యం ఆమెకు లేకపోవడంతో సింగర్ చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెప్పారట. ఏం మాయ చేసావే సినిమాలో చిన్మయి వాయిస్ సమంతకు చాలా కలిసివచ్చింది. ఆ వాయిస్ కు చాలా మంది కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఈ విధంగా చిన్మయి చాలాకాలం పాటు సమంతకు డబ్బింగ్ చెబుతూ వస్తోంది. ఈ విధంగా చెప్తున్న క్రమంలోనే ఓసారి చిన్మయి సమంత కు డబ్బింగ్ చెప్పనని నిర్ణయించుకుందట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి సమంతనే చిన్మయి ఇంటికి వెళ్లి బతిమిలాడితే అప్పుడు మళ్ళీ వచ్చి డబ్బింగ్ చెప్పేందుకు ఓకే చెప్పిందట.. ఇలా కొద్ది రోజులు సాగిన తరువాత వీరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ సమంతా తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం
ప్రారంభించింది.

దీంతో చిన్మయి వాయిస్ ను చాలా మంది మిస్ అవుతున్నారు. సమంత ఒరిజినల్ వాయిస్ బాగా లేదని కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య మాటలు లేవని కొంతకాలంగా సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న మూవీస్ సరిగ్గా హిట్ కావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే యశోద మూవీ మేకర్స్ మళ్లీ చిన్మయి చేత డబ్బింగ్ చెప్పించాలని భావించారట. కానీ సమంత దీనికి ఒప్పుకోవడం లేదని సమాచారం. మరి వీరి మధ్య ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. కానీ సమంత చైతన్య తో విడిపోయిన తర్వాత చిన్మయి సమంతకు మద్దతుగా నిలిచినవిషయం అందరికి తెలిసిందే. కానీ సమంత కు దూరంగా ఉండాలని గతంలో నాగార్జున చిన్మయి కి చెప్పారంటూ కొన్ని వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: