సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సంవత్సరం దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన బీస్ట్ మూవీ కి దర్శకత్వం వహించాడు. బీస్ట్ మూవీ భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా ,  రమ్య కృష్ణ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే జైలర్ మూవీ నుండి చిత్ర బృందం రజనీ కాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా ,  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకులు నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇప్పటికే జైలర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జైలర్ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... జైలర్ మూవీ ని మొదట కేవలం తమిళ్ లో మాత్రమే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల కాబోతున్నట్లు కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తమిళ్ , తెలుగు ,  కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: