నటి రకుల్ ప్రీతిసింగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల లో వరుస సినిమాల లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తాజా గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సిద్ధార్థ మల్హోత్రా, కలిసి నటించిన చిత్రం థ్యాంక్ గాడ్.

సినిమా ఇటీవలే విడుదల ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుందట. ఇక ఈ సినిమా లో నటి రకుల్ ప్రీతిసింగ్ పాత్రకు పెద్ద ఎత్తున ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.ఈ క్రమంలో నే ఈ సినిమా చూసిన రకుల్ తల్లిదండ్రులు సైతం ఆమెకు ఫోన్ చేసి తనని అభినందించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

థ్యాంక్ గాడ్ సినిమా చూసిన తన తల్లిదండ్రు లు అర్ధరాత్రి సమయం లో తన కు ఫోన్ చేశారని రకుల్ వెల్లడించారు.ఈ సందర్భంగా నాన్న ఫోన్ చేసే ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించాన ని తనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలలో ఉత్తమ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని నాన్న సినిమాపై ప్రశంసలు కురిపించినట్టు రకుల్ తెలిపారు.ఈ సినిమా భారతీయ కుటుంబాలకు సంస్కృతికి చాలా దగ్గరగా ఉందని నాన్న ప్రశంసలు కురిపించారని రకుల్ తెలిపారట

ఇక నాన్న నాతో మాట్లాడి సినిమాపై ప్రశంస లు కురిపించిన అనంతరం డైరెక్టర్ నెంబర్ తీసుకు ని తనకి కూడా ఫోన్ చేసి ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు అంటూ ఈ సందర్భంగా థ్యాంక్ గాడ్ సినిమా పట్ల తన తల్లిదండ్రులు స్పందించిన తీరును ఈమె తెలియజేశారు.ఇక ఈ సినిమాని ప్రేక్షకుల తో కలిసి థియేటర్లో చూసినప్పుడు వారి నుంచి వచ్చిన స్పంద న చూసి చాలా ఆశ్చర్యాని కి గురయ్యా నంటూ ఈ సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ తన సినిమా గురించి చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: