పుష్ప  2 : టాలీవుడ్  స్టార్  హీరో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-ది రైజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ కూడా తెలిసిన విషయమే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని కట్టిపడేసింది. మాస్ సినిమాను జనాల్లోకి సుకుమార్ తీసుకెళ్లిన తీరు చాలా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఈ సినిమా  తెలుగులో స్వల్ప నష్టాలు ఎదురుకున్నా కూడా ఇతర భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.పుష్ప ఫస్ట్ పార్ట్ అందుకున్న హిట్ తో రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు ఫుల్ జోష్ మీదున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకుని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు కూడా రెడీ అయ్యారు.ఇక ఈసారి అల్లు అర్జున్ లుక్ పరంగా కొన్ని మార్పులు ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 


అయితే ఈ సీక్వెల్ సినిమాను ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చే విధంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగిందట. అసలు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎంత బడ్జెట్ అయినా కూడా ఓకే అంటున్నారు ఈ సినిమా నిర్మాతలు.ఫస్ట్ పార్ట్ కంటే రెట్టింపు బడ్జెట్‌ను ఇప్పటికే రెండో పార్ట్ సినిమాకు కేటాయించింది మైత్రీ మూవీ మేకర్స్. అలాగే ఓవర్ సీస్ లో కనివిని ఎరుగని రీతిలో బిసినెస్ చేసిందని సమాచారం తెలుస్తుంది. ఈ సీక్వెల్ సినిమా కోసం సుకుమార్ కొన్ని అద్భుతమైన సీక్వెన్స్‌లు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. వాటికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని మూవీ యూనిట్ చెబుతుండగా నిర్మాతలు దేనికైనా రెడీ అంటున్నారట. మొత్తానికి పుష్ప-2 సినిమా విషయంలో అటు నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ.. ఇటు నిర్మాతలు కానీ దూసుకెళ్తుండటం నిజంగా విశేమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: