తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో కామెడీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించడం మాత్రమే కాకుండా , ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన నటన తో కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఇది ఇలా ఉంటే అల్లరి నరేష్ తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించగా , ఆనంది ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా బిజినెస్ లు కూడా ఇప్పటికే స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను ప్రముఖ సంస్థ అయినటు వంటి రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో నవంబర్ 24 వ తేదీనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: