బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ ప్రస్తుతం వరస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రన్బీర్ కపూర్ ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా భారీ బడ్జెట్ మూవీ లు కావడం విశేషం. మొదట గా రన్బీర్ కపూర్ ఈ సంవత్సరం షంషేరా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది. ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఆ తర్వాత భారీ బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర అనే మూవీ లో రన్బీర్ కపూర్ హీరో గా నటించాడు. ఈ మూవీ లో అలియా భట్ హీరోయిన్ గా నటించగా , అమితా బచ్చన్ , నాగార్జున ,  మౌని రాయ్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కూడా హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్నలో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న రన్బీర్ కపూర్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా రన్బీర్ కపూర్ పాకిస్తాన్ మూవీ లో నటించే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్నకు తనిదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. కళకు ,  కళాకారులకు ఏ మాత్రం సరిహద్దులు ఉండ.వు ప్రస్తుతం నేను సౌదీలో ఉన్నాను. ఈ దేశ పరిశ్రమతో పని చేయాలని అనుకుంటున్నాను. ఛాన్స్ వస్తే పాకిస్తాన్ మూవీ లలో కూడా పని చేస్తాను అని రన్బీర్ కపూర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: