బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకటి అయినటువంటి రన్విర్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రన్వీర్ సింగ్ ఇప్పటివరకు నేరుగా ఒక్క తెలుగు మూవీలో కూడా నటించక పోయినప్పటికీ ఈ హీరో నటించిన హిందీ సినిమాల ద్వారానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రన్వీర్ సింగ్ ఆఖరుగా 83 మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ లో రన్వీర్ సింగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు  83 మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా రన్వీర్ సింగ్ సర్కస్ అనే మూవీ లో హీరోగా నటించాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో వరుణ్ శర్మ , పూజ హెగ్డే , ఫెర్నాడేస్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ సెట్స్ లో ఎవరైనా సిన్సియారిటీ లేకపోతే తనకు కోపం వస్తుంది అని చెప్పుకొచ్చాడు. అలాగే ఏకాగ్రతతో షూటింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే రన్విర్  సింగ్ ఆగ్రహిస్తాడు అని కూడా గతంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి చెప్పుకొచ్చాడు. 83 మూవీ తో ప్రేక్షకులను నిరాశపరచిన రన్వీర్ సింగ్ "సర్కస్" మూవీ తో ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: