బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ప్రేమ పక్షుల్లా విహరించిన కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్ర ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే . ఇకపోతే ఇన్ని రోజులు ప్రేమలో ఉన్న వీరు ఇప్పటివరకు తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టకపోవడమే ఆశ్చర్యం.. కనీసం ఇప్పటికైనా వారి ప్రేమ గురించి బయట పెడతారు అని అందరూ అనుకున్నారు.. కానీ ఉన్నట్టుండి వివాహం చేసుకొని షాక్ ఇవ్వడంతో టాలీవుడ్,బాలీవుడ్ ఇండస్ట్రీలలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ గా పేరు తెచ్చుకున్న కే ఆర్ కే.. కియారా అద్వానీ , సిద్ధార్థ మల్హోత్రా పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలియా లాగే కియారా అద్వానీ కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది.  అందుకే ఇంత గుట్టు చప్పుడు కాకుండా సడన్గా పెళ్లి ప్రకటించి వివాహం చేసుకుంది అంటూ హాట్ బాంబు పేల్చాడు.  అంతటితో ఆగకుండా బాలీవుడ్లో ఇప్పుడు మొదట ప్రెగ్నెంట్ ఆ తర్వాతే పెళ్లి ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది అంటూ కామెంట్ చేయడంతో ఇది కాస్త సంచలనం సృష్టిస్తోంది.

ఇకపోతే కియారా అద్వాని ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.. మొత్తానికి అయితే ఆలియా కూడా రణబీర్ కపూర్ ను ప్రెగ్నెంట్ అయిన తర్వాతనే వివాహం చేసుకుంది. కానీ ఈ విషయాన్ని ఆమె ప్రకటించలేదు.  వివాహం జరిగిన నెలకే తాను ప్రెగ్నెంట్ అని వివాహం జరిగిన ఎనిమిది నెలలకే బిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  అప్పుడు వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యానని అసలు విషయం రివీల్ చేసింది. మరి కియారా పై కూడా ఇప్పుడు ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమవుతాయా లేక రూమర్స్ మాత్రమేనా అని తెలియాలంటే కియారా స్పందించక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: