టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న సినిమా ''దసరా''.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్  బరిలో కి దిగబోతుంది..

ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రమే టార్గెట్ చేసిన నాని ఈ సినిమాతో మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడని తెలుస్తుంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడని తెలుస్తుంది.అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎక్కడైనా సరే పక్కా హిట్ అంటూ కామెంట్స్ కూడా చేస్తూ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతూ వస్తున్నాడట.. రా అండ్ విలేజ్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇప్పటికే నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను విడుదల చేసారు మేకర్స్..

ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేసారు.. ఈ టీజర్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో సాలిడ్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి నాని బర్త్ డే కానుకగా బ్లాస్టింగ్ అప్డేట్ ను ఇస్తున్నట్టు వారు తెలిపారు.. అది కూడా ఇండియన్ సినిమా దగ్గర మొట్టమొదటి సారిగా తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చారు... మరి ఆ అప్డేట్ ఏంటంటే.. నాని 39 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇండియన్ వైడ్ గా మొత్తం 39 సెంటర్స్ లో ఈ సినిమా కౌంట్ డౌన్ ఇన్స్టాలేషన్స్ ను పెట్టబోతున్నట్టు వారు తెలిపారు. అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఆడియెన్స్ లో అలర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇండియాలో మొదటిసారి జరుగుతున్నట్టు కూడా మేకర్స్ చెబుతున్నారట.

ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: