టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా కుటుంబంకు ఉన్నా గౌరవం గూర్చి ప్రత్యేకం గా చెప్పానక్కరలేదు. ఆ పేరు వారి కుటుంబం కు మెగాస్టార్ చిరంజీవి గారి వల్ల వచ్చింది.మెగా స్టార్ చిరు గారి తమ్ముడు ఐనా నాగబాబు గారి తనయుడు ఐనా వరుణ్‌ తేజ్‌ ఇప్పటికే పది సినిమాలకు పైగా నటించి అందులో కొన్ని హిట్స్ గా కొన్ని ప్లాప్స్ గా నిల్చయి. ఐతే అందులో భాగంగానే ఆయన కథానాయకుడిగా తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమా రూపొందుతోంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.

మూవీ సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యథార్థ సంఘటనల ఆధారంగా, ఓ యాక్షన్‌ డ్రామాగా తెరకేక్కుతున్న  ఈ మూవీ లో వరుణ్‌తేజ్‌ సరసన అందాల భామ మానుషి చిల్లర్‌ నాయికగా ఎంపికైంది. ఆ విషయాన్ని ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించాయి నిర్మాణ సంస్థలు. 2017 మిస్‌ యూనివర్స్‌గా నిలిచిన మానుషి, 'సామ్రాట్‌ పృథ్వీరాజ్‌' మూవీ తో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది.

ఐతే ఈ మూవీ లో వరుణ్‌ ఒక వైమానిక దళ పైలెట్‌గా నటిస్తుండగా, మానుషి రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో సందడి చేయనున్నారు. మానుషి మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన ఓ అద్భుతమైన మూవీ లో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. వరుణ్‌తేజ్‌తో కలిసి ఆన్ స్క్రీన్ ను పంచుకోవడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా'' అన్నారు. ఐతే దేశభక్తి ప్రధానంగా సాగే ఈ మూవీ లో వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లు ఎలా ఉంటాయో ఉత్కంఠ రేకెత్తించేలా తెరపై ఆవిష్కరిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. వరుణ్‌తేజ్‌ 13వ సినిమాగా శుక్రవారం నుంచే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా చిత్రీకరణ తెలుగుతోపాటు, హిందీలోనూ ఏకకాలంలో జరగనుంది.

మెగా అభిమానులుగా వరుణ్ తేజ్ గారి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: