గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ఆఖరుగా పోనియన్ సెల్వన్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో మొదటి భాగాన్ని పోయిన సంవత్సరం భారీ ఎత్తున థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి తమిళ భాషలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇతర భాషలలో తమిళ భాషతో పోలిస్తే వచ్చిన రేంజ్ రెస్పాన్స్ మాత్రం రాలేదు. 

మూవీ లో తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటు వంటి హీరోలు అయినటు వంటి చియాన్ విక్రమ్ ... కార్తి ... జయం రవి హీరోలుగా నటించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ... త్రిష ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.

వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ని "4 డి ఎక్స్" వర్షన్ లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే సౌత్ ఇండియా నుండి "4 డి ఎక్స్" లో ఇలా విడుదల అవుతున్న మొట్ట మొదటి సినిమాగా కూడా ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ యొక్క రెండవ భాగంపై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: