తెలుగు లో ఎన్నో బుల్లి తెర టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించిన ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజు గారి గది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అశ్విన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

రాజు గారి గది మూవీ తర్వాత ఈ యువ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పలు సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. అశ్విన్ ముఖ్యంగా హర్రర్ జోనర్ లో రూపొందిన రాజు గారి గది ... రాజు గారి గది 2 ... రాజు గారి గది 3 మూవీలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.  ఇది ఇలా ఉంటే అశ్విన్ తాజాగా హిడింబా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ యొక్క షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. 

మూవీ లో అశ్విత్ సరసన నందిత శ్వేతా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ కన్నెగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని ట్రైలర్ ను మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ ట్రైలర్ కు సంబంధించిన మరో అప్డేట్ ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ కు ఈ మూవీ బృందం సెన్సార్ కార్యక్రమాలను నిర్వహించగా ... దానికి "ఏ" సర్టిఫికెట్ వచ్చినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: