సాధారణంగా ఇన్కమ్ టాక్స్ శాఖ లక్ష రూపాయలు దాటితే చాలు ప్రతి ఒక్కరికి కొంత మొత్తం పన్ను విధించడం తప్పనిసరి. ఇక సామాన్యుడి తో సహా పన్ను కట్టడం మొదలైంది. అయితే ఇటీవల కాలంలో మన వాళ్ళందరికీ కలిగిన ప్రశ్న ఏమిటంటే, సామాన్యుడు కూడా ప్రతి లక్ష రూపాయలకు ఎంతోకొంత మొత్తంలో టాక్స్ కింద చెల్లించుకుంటున్నారు. మరి ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగా ఉన్న కొంతమంది ఐటీ శాఖకు ఎంత మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారు అనే ఈ విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ కుతూహలంగా ఉంది. అయితే ఈ కుతూహలాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది ప్రోపబ్లికా అనే మీడియా.. పదహేను సంవత్సరాలుగా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ యొక్క డేటా రికార్డులను, గత కొంత కాలం నుంచి పరిశీలించిన తరువాత ఈ వివరాలన్నింటినీ బయటపెట్టినట్లు ప్రో పబ్లికా మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ఎవరెవరు ఎంతెంత పన్ను చెల్లిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్:
ఈయన 2007 వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధిక మల్టీ మిలియనీర్ గా ఉన్నారు. అయితే ఈయన ఇప్పటి వరకు కనీసం ఒక డాలర్ కూడా ఆదాయపు పన్ను చెల్లించడం లేదు అనే నిజాన్ని ఈ పత్రిక బయటపెట్టింది. అంతేకాదు 2011 సంవత్సరంలో కూడా ఆయన ఒక డాలర్ ని కూడా ఆదాయపు పన్ను కింద చెల్లించనేలేదట.2. ఎలన్ మస్క్ :
2018లో ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. అయితే ఈయన కూడా ఒక్క డాలర్ కూడా ఆదాయపు పన్ను చెల్లించలేదట.ఇక వీరితో పాటు బిలియనీర్ ఇన్వర్టర్ కార్ల్ ఇఖాన్, మైకేల్ బ్లూమ్ బెర్డ్, జార్జ్ సోరోస్ లు కూడా పలుసార్లు ఆదాయపు పన్ను చెల్లించలేదట. ఇదిలా ఉండగా 6,28,300 డాలర్లకు పైగా సంపాదిస్తున్న ఒక దంపతులు గరిష్ఠంగా 37 శాతం పన్ను చెల్లిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలో ఇంత సంపన్నులైన వీరు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పన్ను చెల్లించడం లేదు అనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇలాంటి వారికోసం అమెరికా ఇకపైన ఎలాంటి చట్టాలు తీసుకురానుందో వేచి చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి