సోషల్ మీడియాల ద్వారా వైరల్ అవుతున్న ఈ అంశంపై పిఐబి క్లారిటీ ఇచ్చింది.. ముఖ్యంగా ఈ వార్తపై తనిఖీ చేసి వైరల్ అవుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు అని స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ ముద్ర యోజన పథకాన్ని కింద లోన్ పొందాలంటే రూ.4500 ఫీజు చెల్లించాలని పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. వ్యక్తులు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దని సూచించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లేక పూర్తిగా నాకు లేదని పిఐబీ తన ఫ్యాక్ట్ చెక్ లో గుర్తించింది.
అంతేకాదు పీఎం ముద్ర లోన్ తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి అదనపు రుసుమును వసూలు చేయడం లేదు అని, ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాంటిదే ఇప్పటివరకు ప్రకటించలేదు అని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఏ వార్త అయినా సరే మీరు స్వయంగా బ్యాంకులకు వెళ్లి నేరుగా అసలు విషయం ఏమిటో తెలుసుకోవచ్చు అని కూడా క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా ముద్ర స్కీం కింద లోన్ పొందాలి అంటే ప్రాసెసింగ్ ఫీజు రూ.4500 చెల్లించాలి అన్నదాంట్లో నిజం లేదని ప్రూవ్ అయింది.