హీరో రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ 'ఇస్మార్ట్ శంకర్'. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ను ఫిక్స్ చేసుకుంది. తెలంగాణాలో ప్రస్తుతం బోనాలు జరుగుతుండగా.. ఆ బోనాలను తమ సినిమా ప్రచారానికి వాడుకోవటానికి 'ఇస్మార్ట్ బోనాలు' పేరుతో వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపబోతుంది. వరంగల్ లో హైగ్రీవాచారి మైదానంలో జులై 7వ తేదీన ఈ ఇస్మార్ట్ బోనాలు జరగనున్నాయి. అయితే తెలంగాణ వరకూ బాగానే ప్లాన్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్'.. ఆంధ్ర గురించి మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. మరి 'ఇస్మార్ట్ శంకర్'కి ఆంధ్రా వద్దా.. కనీసం ఒక ప్రెస్ మీట్ అన్నా ఆంధ్రలో పెడితే బాగుటుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 18న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు ఇప్పటికే అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్ లో కనపింబోతున్నారు. సినిమా పై భారీ అంచనాలున్నాయి. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.