సిద్ధార్థ సినిమాలొచ్చి చాలా రోజులైంది. అయినా తనకి కాస్తో కూస్తో ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ బాగానే ఉంది. అందుకు కారణం సిద్ధార్థ ఎంచుకునే కథలని అర్థం చేసుకోవచ్చు. మొదటి నుండి కూడా కథలో ఏదో కొత్తదనం ఉంటేగానీ, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మితేగానీ సినిమాలకు సంతకం చేయరు సిద్ధార్థ. ఇక మ్యూజిక్ డైరక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతాడు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే, ఆ కథ ఎంత స్పెషల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 'ఎరుపు పసుపు పచ్చ' అనే సినిమాను తమిళంలో 'సివప్పు మంజల్ పచ్చై' పేరుతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం 'శశి'. 'బిచ్చగాడు' సినిమాతో అటు తమిళం లోను ఇటు తెలుగులోను డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు.
ఇక 'బిచ్చగాడు' తర్వాత స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేసి ఆయన తెరకెక్కిస్తున్న ఈ 'ఎరుపు పసుపు పచ్చ' సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక 'ఎరుపు పసుపు పచ్చ'ను అభిషేక్ ఫిల్మ్స్ మంచి ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. తమిళంలో ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఫైనాన్షియర్గా వ్యవహరించి, తెలుగులో 'శివలింగ', 'బ్లఫ్మాస్టర్' వంటి హిట్ సినిమాలను అందించిన రమేష్ పిళ్లై 'ఎరుపు పసుపు పచ్చ'ను నిర్మిస్తున్నారు.
ఒక ట్రాఫిక్ ఇనస్పెక్టర్కీ, ఒక బైక్ రేసర్కీ మధ్య సాగే ఎమోషనల్ వార్ సినిమా అని తెలుస్తోంది. మంచి భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందించారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ ప్రథమార్ధంలో తమిళ్తో పాటు తెలుగు, హిందీలోనూ విడుదల చేయనున్నారు. మల్టీ లాంగ్వేజ్ లో తెరకెక్కిన యూనివర్సల్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. చాలా సెలెక్టెడ్ గా సినిమాలను ఎంచుకుంటున్న సిద్ధార్థ కి ఈ సినిమా తెలుగు, తమిళంలో భారీ విజాయాన్ని ఇస్తుందా లేదా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.