యంగ్ హీరోలు సందీప్ కిషన్, నిఖిల్ నాసాలో సందడి చేస్తున్నారు. షూటింగ్స్కి బ్రేకిచ్చి, ఈ యంగ్ హీరోలు సరదాగా నాసా టూర్ వేశారు. ఆ టూర్లోని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఫ్యాన్స్తో పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం హీరో సందీప్ కిషన్ 'తెనాలి
రామకృష్ణ బిఎబిఎల్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆల్రెడీ 'నిను వీడని నీడను నేనే' సినిమాతో హిట్ కొట్టాడు సందీప్ కిషన్. నిఖిల్ విషయానికి వస్తే, 'అర్జున్ సురవరం' రిలీజ్ వాయిదా పడడంతో కొంచెం డిప్రెషన్లోకి వెళ్లిన మాట వాస్తవమే.
అయితే, ఇప్పుడు డిప్రెషన్ నుండి తేరుకుని, ఈ సినిమా విడుదలకు ఓ మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈలోగా కాస్త రీఫ్రెష్మెంట్ కోసం ఇదిగో ఇలా వెకేషన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే నాసాని సందర్శించాడు. నాసా టూర్తో చాలా విషయాలు నేర్చుకున్నామనీ, చాలా సంతోషంగా ఉందని ఈ యంగ్ హీరోలు చెబుతున్నారు. వీరిద్దరితో పాటు, నటుడు ఆదర్శ్
బాలకృష్ణ కూడా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. నటుడిగానే కాకుండా, సెకండ్ సీజన్ బిగ్బాస్ కంటెస్టెంట్గా ఆదర్శ్ అందరికీ సుపరిచితుడు.
ఇక మరి వీరు ముగ్గురు నాసాలోధూమ్ ధామ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే యంగ్ హీరోల్లో ప్రస్తుతం కాస్త ఊపు మీదున్న హీరో
సందీప్ కిషన్ మాత్రమే
నిఖిల్ మార్కెట్ కాస్త తగ్గిందనే చెప్పాలి. కారణాలేమైనప్పటికి ఇదివరకటి అంత ఊపు అయితే
నిఖిల్ సినిమాలకు లేదు. ఇక ఆదర్శశర్మ పాత్రలన్నీ చాలా బావుంటాయి. తను ఒక విలన్గానే కాకుండా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చాలా బాగా చేస్తాడు. ఈ ముగ్గురిలోనూ కొంచం ఊపు మీదున్న హీరో అంటే
సందీప్ కిషన్ అనే చెప్పాలి.