బిగ్‌బాస్‌ 3 షోలో జాఫర్‌ బాబు. ఉన్నది రెండు వారలు ఐనా కూడా తనలో ఉన్న మరో యాంగిల్‌ను చూపించాడు అందరికి . బాబా భాస్కర్‌తో కలిసి ఆయన చేసే కామెడీకి అందరూ బాగా నచ్చింది.ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాక అయ్యాక కూడా తన మిత్రుడు బాబాకు జాఫర్‌ మద్దతుగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా బిగ్‌బాస్‌ షోపై జాఫర్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు  ఫైర్‌ అవ్వడం మొదలు పెట్టారు. ఇటీవల జాఫర్‌ ఓ ఇంటర్య్యూలో.. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 షో ఎలా జరిగిందనే ప్రశ్నకు... ‘కంటెస్టెంట్లు ఎలా ఆడారు..? ఎలాయూ ఉన్నారు??.అని అడగగా ఇలా వీటిపై ఇంతగా చర్చ జరగాల్సిన అవసరం ఉందా? అని ఎదురు ప్రశ్న వేయడం జరిగింది. అసలు ఈ ప్రశ్నల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా?’ అని అన్నాడు.


జాఫర్‌ తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడమే మనిషి వీక్‌నెస్ అని.. ఆ బలహీనతే ఇలాంటి షోలు హిట్‌ అవడానికి కారణం అని తెలిపాడు.కానీ ఇదేమీ గొప్ప షో కాదని, కేవలం బిజినెస్‌ గేమ్‌ అని తేలిగ్గా కొట్టి పడేయడం జరిగింది. ‘బిగ్‌బాస్‌ షోకు ఆర్మీలు ఎందుకు’ అని జాఫర్‌ అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇంటిసభ్యులు ఆడే ఆట కన్నా.. కంటెస్టెంట్లకు మద్దతుగా చేసే ఆడేఆటలు ప్రమాదకరంగా పరిణమించాయని అని పేర్కొన్నాడు.
అయితే, జాఫర్‌ తీరుపై వ్యతిరేకత వస్తుంది అని తెలుస్తుంది.

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా జాఫర్‌ ప్రవర్తిస్తున్నాడని పలువురు నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘బిగ్‌బాస్‌పై చర్చలు అనవసరమని చెప్పిన జాఫర్‌ బాబు.. షో ముగిసిన తర్వాత  బాబా భాస్కర్‌ను ఇంటర్వ్యూ చేయడం ఎందుకని ట్రోల్‌ చేస్తున్నారు. ‘అతను చేస్తే ఒప్పు.. మిగతావాళ్లు చేస్తే తప్పా’ అని అన్నాడు. షో ముగిసేదాకా నోరు మెదపని జాఫర్‌ ఇప్పుడేమో అది కేవలం బిజినెస్‌ గేమ్‌ అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: