స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న
సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో
బన్ని సరసన
పూజా హెగ్దె
హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో
సుశాంత్, నివేదా పేతురాజ్,
నవదీప్ వంటి స్టార్స్ కూడా ఉన్నారు.
2020 సంక్రాంతికి రిలీజ్
ప్లాన్ చేసిన ఈ సినిమాను మళయాళంలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మళయాళంలో
అల్లు అర్జున్ కు అక్కడ స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది. అందుకే అక్కడ అందరు మల్లు
అర్జున్ అని అంటారు. తన ప్రతి సినిమాను అక్కడ రిలీజ్ చేస్తున్న
బన్ని అల వైకుంఠపురములో విషయంలో స్పెషల్ గా
ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో సామజవరగమన సాంగ్ తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఇదే మ్యాజిక్ మళయాళంలో కూడా రిపీట్ చేస్తుంది.
తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ లో
సిరివెన్నెల సాహిత్యం.. సిద్ శ్రీరాం గానం అదిరిపోయింది. ఇప్పటికే
యూట్యూబ్ లో 75 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సాంగ్ మళయాళ వర్షన్ కూడా రిలీజైన కొద్ది గంటల్లోనే వ్యూ కౌంట్ తో అదరగొడుతుంది. ఇప్పటికే 300క్ వ్యూస్ వచ్చినట్టు తెలుస్తుంది. మళయాళంలో
విజయ్ ఏసుదాస్ పాడిన ఈ సాంగ్ కు
హరి నారాయణ సాహిత్యం అందించారు.
జనవరి 12 తెలుగుతో పాటుగా మళయాళంలో కూడా ఈ
సినిమా రిలీజ్ చేసేలా
ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా ఈ
సినిమా అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందని చెప్పొచ్చు. మళయాళంలో త్రివిక్రం కు ఫ్యాన్స్ ఉన్నారు. కచ్చితంగా ఈ కాంబో అక్కడ సంచలనాలను సృష్టిస్తుందని గట్టి నమ్మాకంతో ఉన్నారు చిత్రయూనిట్.