తెలుగు లో గత ఏడేళ్ల అందరి మన్ననలు పొందుతో హాయిగా నవ్వుకుంటున్న ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ పై గత కొన్ని రోజులుగా రక రకాల వదంతులు వినిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ ఉండదు అన్న చందంగా ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ లో జబర్ధస్త్ ముఖ్య సభ్యులు ప్రత్యక్షం కావడంతో ఈ వదంతులపై మరింత నమ్మకం పెరిగిపోతూ వస్తుంది.  ఈ షో ఎంతో మంది జీవితాలనే మార్చేసింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని వారు రాత్రికి రాత్రే సెలబ్రిటీలను తయారు చేసింది. ఈ షో మొదలై ఇప్పటికే దాదాపు 7 సంవత్సరాలు పూర్తి అవ్వనున్నాయి.

 

‘జబర్ధస్త్’  తో ఇద్దరు హాట్ భామలు సినీ పరిశ్రమకు, టివి ఛానల్స్ కి పరిచయం అయ్యారు..వారే అనసూయ, రష్మి.  ఇక  ‘జబర్ధస్త్’ తో టాలీవుడ్ లో వేణు, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, శకలక శంకర్ లాంటి సీనియర్ నటులు వెండితెరపై కమెడియన్లుగా రాణిస్తున్నారు.  శకలక శంకర్ అయితే ఏకంగా హీరోగా నటిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్‌ షో నుంచి ఒక్కరొక్కరు తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాగబాబు షోకు గుడ్‌ బై చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుండగా..తాజాగా యాంకర్ అనసూయ, హైపర్ ఆది కూడా గుడ్ బాయ్ చెబుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్‌కు పోటిగా జీ తెలుగులో గ్యాంగ్‌ స్టార్స్‌ అనే ప్రోగ్రామ్‌ను స్టార్ట్‌ చేస్తున్నారు.

 

ఈ షోకు సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల విడుదలైంది. ఈ కార్యక్రమానికి జడ్జ్‌గా నాగబాబు, యాంకర్‌గా అనసూయ వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్‌లో స్టార్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకుంటున్న హైపర్‌ ఆది కూడా ఈ షో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతానికి జబర్దస్త్ లో స్ట్రాంగ్ టీములుగా అటు హైపర్ ఆది టీమ్, అలాగే సుడిగాలి సుధీర్ టీమ్ లు బలంగా ఉన్నాయి.   ఒకవేళ  హైపర్ ఆదితో పాటు యాంకర్ అనసూయను సైతం తమ ప్రోగ్రామ్ లోకి లాగేయడంలో ఆ చానెల్ సక్సెస్ అయితే మాత్రం..సుడిగాలి సుధీర్ టీమ్, యాంకర్ రష్మీలు మాత్రం జబర్దస్త్ ను ఆదుకోగలడని అభిమానులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: