సమాజంలో రోజురోజుకూ వివాహేతర సంబంధాల పెరిగిపోతున్న విషయం తెలిసిందే. హ్యాపీగా సాగిపోతున్న కాపురంలో కి మూడో వ్యక్తి రావడంతో వివాహేతర సంబంధం మొదలవుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా వివాహేతర సంబంధం నెపంతో ఎంతోమంది హత్యలు కూడా చేస్తున్నారు. కట్టుకున్న భర్త భార్యల కంటే వివాహేతర సంబంధం పెట్టుకున్న వారు ఎక్కువ అని భావిస్తున్న సదరు భార్య భర్తలు కట్టుకున్న వారిని కడతేర్చడానికి కూడా వెనకాడడం లేదు. ఇలా సమాజంలో రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతూనే ఉన్నాయి. 

 

 

 తాజాగా ఓ సినీ నటి కి కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తన భర్త తనను  వదిలేసి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఈ నటి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు వివరాల్లోకి వెళితే... తన భర్త మరో యువతితో వివాహ సంబంధం పెట్టుకొని తనను వేధిస్తున్నాడంటూ తమిళ నటి రమ్య బెంగళూరు కోడిగేహళ్లి  పోలీసులను ఆశ్రయించింది. వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధించడం తో పాటు అదనపు కట్నం తీసుకురావాలని తన భర్త  వరదరాజన్ వేదిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది తమిళ నటి రమ్య. 

 

 

 2017 లో తనకు డాన్స్ మాస్టర్ గా ఉన్న వరదరాజన్ తో  తనకు వివాహం జరిగిందని రమ్య తెలిపింది. వరదరాజన్ తో వివాహం జరిగిన సమయంలో ఇంటి స్థలం బంగారం ఆభరణాలు డబ్బును తమ తల్లిదండ్రులు వరదరాజన్ కు కట్నంగా ఇచ్చారని తెలిపింది  రమ్య. వరదరాజన్  డాన్స్ అకాడమీ ని స్థాపించాలని తన భర్త వరదరాజన్ భావిస్తున్నారని.. అందుకు కావాల్సిన డబ్బులు తెచ్చి ఇవ్వాలంటూ తనను  రోజూ వేధిస్తున్నారంటూ ఆరోపించింది. తనకు నిత్యము హింస ఎదురవుతుందని ఆమె ఆరోపించింది.దీనిపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: