స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని రాధాకృష్ణ, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

 

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్ అదరగొట్టాడు. ఎప్పుడు లేనిది కొత్తగా తండ్రి అల్లు అరవింద్ మీద తన ప్రేమని చూపించిన బన్ని చిరంజీవి అంటే ప్రాణం ఈ కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యాన్ నే అనేశాడు. ఇక మెగా ఈవెంట్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ రాకుండా ఉంటారా ఓ పక్క పవర్ స్టార్ అనే కేకలు వినిపిస్తుంటే మీరు చెబుతున్నారు కాబట్టి పవర్ స్టార్ గురించి మాట్లాడుతా అంటూ మరోసారి పవన్ పై తనకున్న సెపరేషన్ అనేది చూపించాడు అల్లు అర్జున్.

 

ఒకప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాకి చెప్పను బ్రదర్ అంటూ సెన్సేషనల్ సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు చెబుతా బ్రదర్ అంటూ పవన్ మీద మళ్లీ తన వ్యతిరేకత చూపించాడని అంటున్నారు. అయితే ఇవన్ని మీడియా సృష్టించే వార్తలే తప్ప పవన్ అంటే అల్లు అర్జున్ కు ఇష్టమని కాకపోతే పవన్ గురించి మాట్లాడటానికి మాత్రం అల్లు అర్జున్ ఇష్టపడటం లేదు. అయితే అల వైకుంఠపురములో అల్లు అర్జున్ స్పీచ్ పై అల్లు ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ పవన్ అల్లు అర్జున్ కనిపించేదాకా ఈ వార్తలు వస్తూనే ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: