అక్కినేని కాంపౌండ్ నుండి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చినా అక్కినేని కుటుంబం మూడు తరాల హీరోలు నటించిన ‘మనం’ స్థాయిలో మరొక సినిమా ఇప్పటి వరకు రాలేదు. దీనితో నాగార్జున ‘మనం’ సినిమా అన్నా ఆ సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ అన్నా విపరీతమైన గౌరవం. 


దీనితో ఇప్పుడు మళ్ళీ అదే ఛాయలతో ఉండే మూవీ రాబోతోందా అన్న సంకేతాలు వస్తున్నాయి. నాగ చైతన్య ప్రస్తుతం చాలా బిజీగా ఉంటున్నాడు. శేఖర్ కమ్ములతో చేస్తున్న సినిమా సెట్ మీద ఉండగానే సొంత ప్రాజెక్ట్ ‘బంగార్రాజు’ మూవీ చేయడానికి లైన్ క్లియర్ చేసాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే దర్శకుడు పరుశు రామ్ చెప్పిన ఒక వెరైటీ కథకు నాగ చైతన్య నాగార్జునలు ఓకె చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. 


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి ‘నాగేశ్వరరావు’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. వాస్తవానికి అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ తీయమని చాలామంది నాగార్జునకు సూచిస్తున్నారు. 


అయితే తన తండ్రి జీవితంలో చెప్పుకోతగ్గ సంచలనాలు ఏమి లేకపోవడంతో అక్కినేని బయోపిక్ లో కొత్తగా చెప్పే విషయాలు ఏమి ఉంటాయి అంటూ నాగార్జున అభిప్రాయపడుతున్నాడు. అయితే ఈ విషయాలను తెలివిగా గ్రహించిన పరుశు రామ్ ఏకంగా తన కథలో పాత్రకు నాగేశ్వరరావు పేరు పెట్టి అదే మూవీ టైటిల్ గా మార్చి చాల సులువుగా నాగార్జునను ఒప్పించాడు అనుకోవాలి. ‘గీత గోవిందం’ తరువాత పెద్ద హీరోలతో మాత్రమే సినిమాను తీస్తాను అంటూ ప్రయత్నాలు చేస్తున్న పరుశు రామ్ కు ఇప్పటికి అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలి. దీనితో ‘మనం’ లానే ఈ మూవీ కూడ సంచలనాలు సృష్టించే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: