బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఓ సాదాసీదా దర్శకుడితో సినిమా చేసే రేంజ్ ప్రభాస్ ఎప్పుడో దాటిపోయాడు. ప్రభాస్‌ చిత్రంలో నుండి భారీతనం లేకుండా ఊహించుకోవడం కష్టమైన పనే. బాహుబలి సినిమా ప్రభాస్ దర్శకుడు సుజీత్ ‘సాహో’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అయితే ఆ సినిమాలో భారీతనం ఉంది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది.  

 

తాజాగా ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ చిత్రానికి జాన్, ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ప్రచారంలో ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ స్టామినాకి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో ‘సాహో’ మాదిరి భారీగానే ఖర్చు చేస్తున్నారట.

 

జార్జియాలో ఈ మూవీ షూటింగ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా ఒక సింగిల్ షాక్‌కి రూ. 2 కోట్లు వరకూ ఖర్చు చేశారట. ఇంత ఖర్చుపెట్టిన తీసిన ఈ సింగిల్ షాట్ ప్రత్యేక ఏంటంటే.. భారీ ఛేజ్ సీన్ మొత్తాన్ని ఒకే ఒక్క షాట్‌లో తీయడమే. ఈ భారీ యాక్షన్ చేజింగ్ సీన్ కోసం ఇంటర్నేషనల్ క్రూ పనిచేయడంతో ఈ సినిమాలో ఈ సీన్ హైలైట్ కాబోతుందని సమాచారం.మరి రాధాకృష్ణ ఎలాంటి ఔట్ పుట్ ఇచ్చి.. డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ నింపుతారో చూడాలి.

 

సినిమా సెట్స్‌పై ఉండగానే తన నెక్స్ట్ సినిమాను లైన్‌లో పెట్టారు ప్రభాస్. ఇటీవల ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు ప్రభాస్. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్‌తో భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల నాగ్ అశ్విన్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: