ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగిన సిద్ధార్థ్ టాలీవుడ్ లో సినిమాలు చేయక 7 సంవత్సరాలు అవుతుంది. సిద్ధార్థ చివరిసారిగా తారక్ కథానాయకుడిగా నటించిన బాద్షా సినిమా లో కనిపించాడు. ఆ తర్వాత గృహం లాంటి డబ్బింగ్ చిత్రాల్లో అడపాదడపా కనిపించాడు కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమా ల్లో నటించలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... శర్వానంద్ నటిస్తున్న సినిమాలో ద్వితీయ హీరోగా సిద్ధార్థ నటించబోతున్నాడని తెలుస్తుంది.


ఇటీవల కాలంలో శర్వానంద్ సినీ కెరీర్ ఏమీ బాగోలేదని చెప్పుకోవచ్చు. గత ఏడాదిలో విడుదలైన శర్వానంద్ 'రణరంగం' చిత్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పడి పడి లేచే మనసు చిత్రంలో సాయి పల్లవి శర్వానంద్ ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా చూడచక్కగా ఉన్నాయి కానీ కథనం సరిగ్గా లేక ఆ చిత్రం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత అగ్రతార సమంత తో కలిసి జాను చిత్రంలో నటించినప్పటికీ... అది మాత్రం తనకు హిట్ అందించలేదు. నిజానికి జాను తమిళనాడులో బాగా హిట్ అయిన 96 సినిమాకి రీమేక్. కానీ ఆ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు నచ్చకపోవడం శర్వానంద్ యొక్క దురదృష్టం అని చెప్పుకోవచ్చు.


శర్వానంద్ తాజాగా శ్రీకారం అనే సినిమాలో నటించాడు. ఆ చిత్రం ఏప్రిల్ 24వ తేదీన విడుదల అవ్వాలి కానీ... కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జూన్- జూలై వరకు వాయిదా పడింది. బి కిషోర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా... ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయికగా నటించగా... మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మరి ఈ చిత్రమైనా తనకు హిట్ అందిస్తుందో లేదో చుడాలిక. ఈ చిత్రాన్ని మినహాయించి శర్వానంద్ ఆర్ఎక్స్ 100 సినిమా ని తెరకెక్కించిన దర్శకుడైన అజయ్ భూపతి తదుపరి చిత్రం 'మహా సముద్రం' లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రెండు కథానాయకుల పాత్రలు ఉండగా సెకండ్ హీరో పాత్రలో బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ నటించనున్నాడని సినీ వర్గాల నుండి టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: