బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ మరణంతో అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు  శోకసంద్రంలో మునిగి పోయిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల సమయం లోని భారత చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ లెజెండరీ నటులైన ఇద్దరిని కోల్పోవడం చాలా విషాదకరమైన విషయం. ఇక దశాబ్ధాల కాలం నుంచి భారత సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్నారు లెజెండ్రీ నటుడు రిషి కపూర్. అలాంటి లెజెండరీ నటుడి మరణం ప్రస్తుతం ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు అందరికీ రిషి కపూర్ సన్నిహితుడే . అందుకే రిషి కపూర్ మరణంతో భారత చిత్ర పరిశ్రమ మొత్తం షాక్ కి గురి అయింది అని చెప్పాలి. 

 

 

 ఇక రిషి కపూర్ మరణంపై ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రిషి కపూర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రిషి కపూర్ మరణంపై తీవ్ర  దిగ్భ్రాంతికి గురి చేసింది అంటూ బావోద్వేగపూరితమైన సంతాపాన్ని తెలియ జేస్తున్నారు. రిషి కపూర్ మా మధ్య లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  సినీ ప్రముఖులు. భారత చిత్ర పరిశ్రమ ఒక లెజెండరీ నటున్ని కోల్పోయిందని... ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరు తీర్చలేరు అంటూ సంతాపం తెలియజేస్తున్నారు. 

 

 

 అయితే తాజాగా రాధిక శరత్ కుమార్ కూడా రిషి కపూర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ అరుదైన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ఎంతో విచారం అంటూ రిషి కపూర్ తో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది రాధిక శరత్ కుమార్. ఈ ఫోటోలు రాధిక,  రిషీకపూర్,  శరత్ కుమార్ తో పాటు ప్రభుదేవా, ప్రకాష్ రాజ్  కూడా ఉన్నారు. రిషి కపూర్ చిరునవ్వులు నవ్వుతున్న ఈ ఫోటో ప్రస్తుతం అభిమానులందరినీ కన్నీరు పెట్టిస్తుంది. అయితే రిషి కపూర్ భౌతికంగా మరణించినప్పటికీ మా హృదయాలలో ఎప్పటికి జీవించే ఉన్నారు అని అభిమానులు లెజెండరీ నటుడికి సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: