నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సింహా, లెజెండ్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. 

 

లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, పల్నాటి బ్రహ్మ నాయుడు, ఇలా బాలయ్యతో క్రేజీ సినిమాలు చేసిన గోపాల్ మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య బాబు మిడిల్ ఏజ్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. అంటే తండ్రి పాత్రలో ఒరిజినాలిటీకి దగ్గరగా ఆ పాత్ర ఉండేలా చూస్తున్నారట. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో ఈ సినిమా వస్తుందట. ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపించేలా ఈ సినిమా ఉంటుందట. 

 

అయితే ఈ సినిమాలో బాలకృష్ణ ఫాదర్ రోల్ లో చేయడం అందరిని సర్ ప్రయిజ్ చేస్తుంది. మాస్ అండ్ కమర్షియల్ హీరోగా ఇప్పటికి తన స్టామినా చూపిస్తున్న బాలయ్య బాబు తండ్రి పాత్రలో మెప్పించాలని చూస్తున్నాడు. అయితే చేసేది తండ్రి పాత్ర అయినా సినిమాలో నందమూరి ఫ్యాన్స్ కు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి బాలయ్య బాబు బి.గోపాల్ కాంబో మరో సెన్సేషనల్ మూవీ చేస్తారని చెప్పొచ్చు. ఇక ఇదే కాకుండా బాలకృష్ణ మరోసారి పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పైసా వసూల్ సినిమా తర్వాత వెంటనే ఈ కాంబో మూవీ ఉంటుందని అన్నారు మరి ఈసారి బాలకృష్ణతో పూరి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: