బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు అనుష్కశర్మ. ఓ వైపు తన హాట్ హాట్ అందాలతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోవైపు తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. వరుస అవకాశాలు దక్కించుకుని  ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అనుష్క శర్మ. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది.  ఇటీవలే అనుష్క శర్మ ఓ వెబ్ సిరీస్ కోసం ఏకంగా నిర్మాతగా కూడా అవతారం ఎత్తిన  విషయం తెలిసిందే. పాతాల్  లోక్  అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది అనుష్క శర్మ. అయితే ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది ఈ వెబ్ సిరీస్.  

 


 ఇక అనుష్క నిర్మించిన పాతల్ లోక్  వెబ్ సిరీస్ పై మొదటి నుంచి ఎన్నో వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లోని కొన్ని సన్నివేశాలు గుర్జా  వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా  పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇలా పలు వివాదాల్లో చిక్కుకున్న ఈ పాతాల్  లోక్  అనే వెబ్ సిరీస్ పై ఇప్పటికి  చర్చ నడుస్తోంది. ఇక వెబ్ సిరీస్ ఆద్యంతం  ఎంతో ఆసక్తికరంగా సాగింది అని కొందరు కామెంట్ చేస్తున్నారు . సినీ ప్రముఖులందరూ ఈ వెబ్ సిరీస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో కొంత మంది నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 


 బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సైఫ్ అలీ ఖాన్ నటించిన వెబ్ సిరీస్ సీక్రెట్ గేమ్స్ లాగా ఈ వెబ్ సిరీస్  ఉందని కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా నిర్మాత అనుష్క శర్మ స్పందించారు.ప్రజలు ఎప్పుడు రెండింటి మధ్య పోలికలు వెతకడానికి ప్రయత్నిస్తారని కానీ ఈ రెండు వెబ్ సిరీస్ లలో ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. ఓటిటి  వేదికగా మంచి కంటెంట్ కు ఇచ్చేందుకు ఎంతోమంది ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నారు... వారందరికీ అభినందిస్తున్న అంటూ తెలిపింది. ఇక ఈ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కగా  అవినాష్ తరుణ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: