తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన పెద్దన్న పాత్రను కొనసాగిస్తూ చిరంజీవి ఈనెల 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఇండస్ట్రీ ప్రముఖులతో కలవడానికి రంగం సిద్ధం అయినట్లుగా ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించిన కథనం హాట్ న్యూస్ గా మారింది. ఆపత్రిక కథనం ప్రకారం చిరంజీవి ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు దర్శకులు ప్రముఖ హీరోలతో ఒక టీమ్ ను సెట్ చేసుకుని ముఖ్యమంత్రిని చిరంజీవి కలవబోతున్నాడు అంటూ ఆపత్రిక ఊహాగానం.


గతంలో జరిగినట్లుగా కాకుండా ఈసారి ఈటీమ్ బాలకృష్ణను కూడ ఆహ్వానించాలని చిరంజీవి స్థిర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రాయబారాలకు బాలకృష్ణ స్పందిస్తాడా లేదా అన్నవిషయం ఆయనకే వదిలి పెట్టి తన వైపు నుండి తప్పు లేకుండా చూసుకోవాలని చిరంజీవి అభిప్రాయం అని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. 


కొన్నిరోజుల క్రితం బాలకృష్ణ తనను చిరంజీవి ఇంటిలో జరుగుతున్న ఇండస్ట్రీ పెద్దల సమావేశాలకు పిలవడం లేదు అని ఓపెన్ గా అసహనం వ్యక్త పరిచిన పరిస్థితులలో దానికి విరుగుడుగా చిరంజీవి మాష్టర్ ప్లాన్ ఇది అని అంటున్నారు. వాస్తవానికి షూటింగ్ లు తిరిగి ప్రారంభం అయినా షూటింగ్ లలో పాల్గొనడానికి చాలామంది టాప్ హీరోలు కరోనా భయాలతో హడలిపోతున్న పరిస్థితులలో చిరంజీవి ఈపరిస్థితులలో ముఖ్యమంత్రి జగన్ ను ఏమి కోరతాడు అన్నది సస్పెన్స్.


చిరంజీవి నుండి ఆహ్వానం అందినా బాలయ్య ఈ ఆహ్వానానికి స్పందిస్తాడా అన్న విషయమై కూడ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమధ్య బాలకృష్ణ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యల పై వైఎస్ఆర్ పార్టీ వర్గాలు ఎదురు వ్యాఖ్యలు చేస్తూ బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదు అంటూ ఒకప్పటి బాలకృష్ణ ఇంటిలో జరిగిన కాల్పుల సంఘటనను మళ్ళీ తెరపైకి తీసుకువస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో నిజంగా చిరంజీవి ఆహ్వానించినా బాలకృష్ణకు ఆ ఆహ్వానంలో అనేక చిక్కుముడులు ఉన్నాయి అంటూ అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: