‘శివ’ లాంటి ఒక ట్రెండ్ సెటర్ మూవీని తీసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయి కేవలం యూత్ మాత్రమే చూసే బూతు సినిమాల దర్శకుడుగా మారిపోతాడని ఎవరు ఊహించి ఉండరు. శృంగార తార మియా మాల్కోవా తో తీసిన క్లైమాక్స్ మూవీని ధియేటర్లు ఓపెన్ కాకపోయినా 100 రూపాయల టిక్కెట్ పెట్టి ఆన్ లైన్ లో విడుదల చేస్తే ఆ సినిమాకు విమర్శకులు o.5 రేటింగ్ ఇచ్చినా  వర్మ ఏమాత్రం సిగ్గుపడలేదు.

 

అంతేకాదు తన క్లైమాక్స్ మూవీని ఆన్ లైన్ లో మూడు లక్షల మంది చూడటంతో తన మూడు కోట్ల ఆదాయం వచ్చిందని చెపుతూ వర్మ టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల మైండ్ బ్లాంక్ చేసాడు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా వర్మ తన లేటెస్ట్ ‘నగ్నం’ కు సంబంధించి ట్రైలర్ విడుదల చేయడమే కాకుండా ఇది ‘ఆర్ ఆర్ ఆర్’ కాదు ఇది 'ఎన్ ఎన్ ఎన్' అంటూ  మరొక ట్విస్ట్ ఇచ్చి ఏకంగా రాజమౌళిని టార్గెట్ చేసాడు.


నిన్న విడుదలైన ‘నగ్నం’ ట్రైలర్ ను చూసినవారు తెలుగు సినిమాల పతనం ప్రారంభం అయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో  ఇంత వరకు ఏ డైరక్టర్ కూడా ఒక స్త్రీ పై ఈ యాంగిల్ లో కెమెరా పెట్టలేదని కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన అమ్మాయి మొహం కనిపించకుండా కేవలం ఆమె లోవర్ బాడీ పార్ట్స్ అయిన తొడల మీద కాళ్ళమీద ఫోకస్ పెట్టాడు.


ఈట్రైలర్ చూస్తుంటే పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న హస్బెండ్ కథ అని తెలుస్తోంది.  ‘క్లైమాక్స్’  సినిమాకు వంద రూపాయలు పెట్టిన వర్మ ఈసారి మాత్రం రెండు వందల రూపాయలను టికెట్ ధరగా ఈ మూవీకి నిర్ణయించాడు. నిర్ణయించాడు. తాను స్త్రీలను రెట్టింపు ఆరాధిస్తాను కాబట్టి రెట్టింపు ధర ఫిక్స్ చేశానని చెపుతూ వర్మ చేస్తున్న హడావిడిని పరిశీలిస్తున్న వారు మాత్రం ఇప్పట్లో మంచి సినిమాలు విడుదల అయ్యే పరిస్థిత్గులు లేవు కాబట్టి ఇక బూతు సినిమాలదే రాజ్యమా అంటూ ఆవేదన చెందుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: