పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో పిరియాడికల్ మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమాను సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం.రత్నం నిర్మిస్తారని తెలుస్తుంది. అంతేకాదు మొదటిసారి పవన్ కళ్యాణ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట.

 

కేవలం తెలుగు సినిమాల్లో నటించే ఇంతటి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన క్రేజ్ నేషనల్ వైడ్ గా తెలిసేలా చేస్తున్నాడు క్రిష్. ఆయన డైరక్షన్ లో మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారట. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. లాక్ డౌన్ లేకపోతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టే వాళ్లు కాని లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే క్రిష్ సినిమా కూడా స్టార్ట్ చేస్తాడట పవన్ కళ్యాణ్.

 

ఇక ఈ సినిమాతో పాటుగా తనకు గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ హరీష్ శంకర్ తో మరో సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆ సినిమా వస్తుందట. వకీల్ సాబ్ రిలీజ్ తర్వాత పరిస్థితులను బట్టి క్రిష్ సినిమానా లేక హరీష్ శంకర్ సినిమానా ఏది ముందు స్టార్ట్ అవుతుందో తెలుస్తుంది. పవన్ మాత్రం మరో రెండు మూడేళ్లు తన సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించేలా ఉన్నాడు. ఈమధ్య పూర్తిస్థాయిలో రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన పవర్ స్టార్ సినిమాలను చేయడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: