కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కెజిఎఫ్. 2018 డిసెంబర్ సమయంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ముందుగా ఈ సినిమాని కేవలం కన్నడలోనే రిలీజ్ చేద్దాం అని భావించిన యూనిట్, అనుకోకుండా ఒక సందర్భంలో బాహుబలి సినిమాల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిని కలవడం, అనంతరం కెజిఎఫ్ సినిమాలోని కొన్ని కీలక సీన్స్ చూసిన రాజమౌళి, ఈ సినిమాని కేవలం కన్నడకే పరిమితం చేయకుండా, మిగతా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని సూచించడం జరిగింది. 

IHG

ఎందుకంటే ఈ సినిమా కథకు పాన్ ఇండియా ఫీల్ ఉందని రాజమౌళి చెప్పడంతో యూనిట్ సభ్యులు ఆ సినిమాని కన్నడ సహా పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రిలీజ్ చేయగా, ఊహించని విధంగా అన్ని భాషల్లో కూడా ఆ సినిమా అత్యద్భుత విజయాన్ని, కలెక్షన్ ని అందుకుంది. కథ పరంగా మంచి యాక్షన్, ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా కథతో ప్రేక్షక నాడి పట్టేలా సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన హీరో క్యారెక్టర్ ని ఎంతో గొప్పగా పక్కా కమర్షియల్ రేంజ్ లో తీర్చిదిద్దాడు దర్శకుడు ప్రశాంత్. ఇక రిలీజ్ తరువాత ఈ సినిమాకు అన్ని భాషల్లో కూడా గొప్ప విజయం దక్కడంతో పాటు హీరోగా నటించిన యాష్ దేశవ్యాప్తంగా మంచి పేరు గడించారు. 

 

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో లభ్యమవుతున్నప్పటికీ, దీనిని బుల్లితెరపై చూడాలని ఎందరో అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటినుండో ఆశపడుతున్నారు. కాగా ఎట్టకేలకు వారి ఆశలు తీరే రోజు అతి త్వరలో రానుంది. తెలుగు ఛానల్ స్టార్ మా వారు ఈ సినిమాని అతి త్వరలో ప్రసారం చేయబోతున్నట్లు ఇటీవల ఒక ప్రకటన రిలీజ్ చేసారు. దానితో కెజిఎఫ్ మూవీ ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరుస్తోంది. నూతన నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ వారు ఎంతో భారీ ఖర్చుతో నిర్మించడం జరిగింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం కెజిఎఫ్ 2 షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ఆగిపోవడంతో, మిగిలిన భాగాన్ని మరికొద్దిరోజుల్లో షూట్ చేసి, దసరా సమయానికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: