నిన్న మీడియాలో నయనతార కు కరోనా వచ్చింది అంటూ వార్తల హడావిడి జరగడంతో స్వయంగా నయనతార రంగంలోకి దిగి తాను ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ వివరణ ఇచ్చే వరకు నయనతార పై కరోనా రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అక్కినేని వారి కోడలు సమంత వంతు వచ్చింది. 


సమంత ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆమె అభిమానులతో పాటు అక్కినేని కుటుంబ అభిమానులు కూడ భయపడి పోతున్నారు. ఇలా వారికి భయాలు ఏర్పడటానికి ఒక కారణం ఉంది. కొద్దిరోజుల క్రితం సమంత సోషల్ మీడియాలో తన డ్రెస్ డిజైనర్ శిల్పా రెడ్డిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేసింది. 


ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది రోజులకే శిల్పా రెడ్డికి కరోనా టెస్ట్ లలో పాజిటివ్ వచ్చిందని వార్తలు రావడంతో అభిమానులలో గందరగోళం మొదలైంది. సమంత ఈమధ్య శిల్పా రెడ్డి తో ఇలా సన్నిహితంగా వ్యవహరిస్తూ ముద్దు పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటి అంటూ అభిమానులు గందరగోళంగా ఉన్నారు. తెలుస్తున్న సమాహారం మేరకు శిల్పా రెడ్డి తన స్నేహితుల ఇంట్లో జరిగిన ఒక పార్టీకి వెళ్ళినట్లు తెలుస్తోంది. 


అయితే ఐదు రోజుల క్రితం ఆ పార్టీ ఇచ్చిన శిల్పా రెడ్డి స్నేహితురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియడంతో ఖంగారు పడ్డ శిల్పా రెడ్డి తనకు కరోనా లక్షణాలు ఏమి లేనప్పటికీ టెస్ట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ టెస్ట్ లో శిల్పా రెడ్డికి కరోనా లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో శిల్పా రెడ్డి హోమ్ క్వారెంటైన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈవార్తలు మీడియాలో వైరల్ కావడంతో సమంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ సమంత అభిమానులలో టెన్షన్ పెరిగి ఆమె ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: