సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా సర్కారు వారి పాట సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. మొదట్లో ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని నటిస్తుందని వార్తలు వచ్చాయి. కాని ఆమె అక్కడ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మహేష్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఇక ఆ ఛాన్స్ అందుకుంది కీర్తి సురేష్. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. ఆ అవకాశాన్ని మరో మళయాళ భామ నివేదా థామస్ పట్టేసిందని అంటున్నారు.

 

నాని జెంటిల్మెన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన నివేదా థామస్ ఆ తర్వాత నిన్ను కోరి, జై లవ కుశ సినిమాలతో మెప్పించింది. యువ హీరోలతో కలిసి నటిస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు మహేష్ పక్కన ఛాన్స్ పట్టేసింది. కీర్తి సురేష్, నివేదా థామస్ ఇద్దరు అభినయ తారలే. ఏదో గ్లామర్ షో చేసి మార్కులు కొట్టేద్దాం అనుకునే టైపు కాదు. అందుకే సర్కారు వారి పాటలో నివేదా థామస్ అనగానే కీర్తి సురేష్ కు తప్పకుండా పోటీ ఇస్తుందని అనిపిస్తుంది. 

 

మహానటితో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా మహేష్ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. మహేష్ కీర్తి సురేష్ జోడీ అదిరిపోయేలా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ కూడా నటిస్తుంది కనుక తప్పకుండా సినిమాలో ఆమె కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: