రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. మళ్లీ కెమెరా ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే బుల్లితెరపై ఒక శాంపిల్ రిలీజ్ చేసిన రేణు.. నెక్స్ట్ సినిమా చూపించేందుకు ప్రిపేర్ అవుతోంది. ఓ పవర్ ఫుల్ రోల్ తో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతోంది రేణు. 

 

రేణు దేశాయ్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయి చాలా రోజులైనా యాక్టింగ్ గురించి ఆలోచించలేదు. బిహైండ్ ది కెెమెరా వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించింది. యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చి.. డైరెక్షన్ చేసేందుకు స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంది. రైతుల కథాంశంతో ఒక సినిమా తీసేందుకు రీసెర్చ్ కూడా స్టార్ట్ చేసింది. స్వయంగా పల్లెలకు వెళ్లి రైతులతో మాట్లాడి స్టోరీకి ఇన్ పుట్స్ కూడా తీసుకుంది రేణు. 

 

రైతుల సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేసింది రేణు దేశాయ్. ప్రజా గాయకుడు గోరేటి వెంకన్నతో ఒక పాట కూడా రాయించింది రేణు. అయితే లాక్ డౌన్ తో షూటింగ్ లకు బ్రేకులు పడ్డాయి. దీంతో రేణు దేశాయ్ రైతుల కథ సెట్స్ కి వెళ్లేందుకు ఎదురు చూస్తోంది. అయితే ఇప్పుడు రేణు డైరెక్షన్ తో పాటు.. యాక్టింగ్ కూడా చేయబోతోందని ప్రచారం కూడా జరుగుతోంది. 

 

రేణుదేశాయ్ మహేశ్ బాబు నిర్మాణంలో నటించబోతోందని చెప్పుకుంటున్నారు. జి.ఎమ్.బి ఎంటర్ టైన్ మెంట్స్ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాలో రేణు ఓ స్పెషల్ రోల్ ప్లే చేయబోతోందని సమాచారం. ఆల్ రెడీ రేణు ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ కు ప్రమోషన్ వీడియో చేసింది. లాక్ డౌన్ లోనే షూటింగ్ చేసింది. దీంతో రేణు మళ్లీ కెమెరా ముందుకొస్తుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: