హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కు చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా టాలీవుడ్ లో మంచి నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంటుంది. అభిరుచి గల సినిమాలు నిర్మిస్తూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కొత్త కథలను వెండితెర మీదకు తెచ్చేలా చూస్తుంది. సితార బ్యానర్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు చూస్తే బడ్జెట్ మీడియమే అయినా కంటెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇక టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఖర్చీఫ్ వేసే ఈ బ్యానర్ లేటెస్ట్ గా మరో క్రేజీ డైరక్టర్ తో సినిమాకు సిద్ధమైందని తెలుస్తుంది.

 

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన కిశోర్ తిరుమల ప్రస్తుతం రాం తో రెడ్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తై ఫస్ట్ కాపీ కూడ సిద్ధమైన ఈ సినిమా త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ మూవీ తడం రీమేక్ గా రెడ్ సినిమా వస్తుంది. ఈ సినిమాలో రాం డ్యుయల్ రోల్ చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కిశోర్ తిరుమల సితార బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 

 

ఈమధ్యనే డైరక్టర్ తో సితార నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చర్చలు జరిపారట. కిశోర్ చెప్పిన కథ బాగా నచ్చడంతో హీరో, బడ్జెట్ విషయాలు ఆలోచించమని చెప్పారట. కిశోర్ టాలెంట్ కు సితార లాంటి రిజిస్టర్డ్ బ్యానర్ అయితే తప్పకుండా అతనికి తగిన గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తూం చేసిన రెడ్ సినిమా సక్సెస్ అయితే మాత్రం కిశోర్ కు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. టీజర్ తో ఆకట్టుకున్న రెడ్ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు.      

మరింత సమాచారం తెలుసుకోండి: