టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపుగా రెండేళ్లుగా తెలుగు వెండితెరపై కనబడ్డది లేనే లేదు. రెండున్నరేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఆఖరి సినిమా. ఆ తరువాత రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయిన ఎన్టీఆర్, ఇప్పటివరకు కూడా అదే సినిమాలో కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 8న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆయనతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా పొలిటిల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గా తెరకెక్కనున్నట్లు టాక్. ఇకపోతే ఈ రెండు సినిమాల తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నారు. 

IHG

మరికొద్దిరోజుల్లో తామిద్దరి కాంబోలో సినిమా రానున్నట్లు ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ సూచన ప్రాయంగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం యాష్ తో కెజిఎఫ్ సీక్వెల్ అయిన కెజిఎఫ్ చాప్టర్ 2 ని తీస్తున్న ప్రశాంత్, దాని అనంతరం ఎన్టీఆర్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విషయమై కొద్దిరోజులుగా టాలీవుడ్ వర్గాల్లో పలు రకాల చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికి తెలుసు. అలానే అతి త్వరలో రానున్న చాప్టర్ 2 కూడా దానిని మించేలా ఉండనున్నట్లు సమాచారం. అయితే కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నది ఏమిటంటే, కెజిఎఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ కు ఎంతో పెద్ద ఫ్యాన్స్ అయిపోయిన చాలామంది ప్రేక్షకులు, ఆయన నుండి వాటి తరువాత అంతకు మించేలా ఉండే సినిమా కోసం ఎదురు చూస్తారని, అలానే వారి అంచనాలు కూడా ఊహకందని రేంజ్ లో ఉంటాయని చెప్తున్నారు.

 

అయితే ఆ అంచనాలు అందుకునేలా ఎన్టీఆర్ తో ఆయన తీసే సినిమా ఉంటుందా అనేది కొంత అనుమానమే అంటున్నారు. అంటే, కెజిఎఫ్ వంటి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు చూసిన ప్రేక్షకుల కళ్ళను మెప్పించేలా దర్శకుడు ప్రశాంత్, తన నెక్స్ట్ సినిమా తీయగలరా అనేది వారి సందేహం. అయితే టాలీవుడ్ లో రాజమౌళి ని తీసుకుంటే తన సినిమాలను ఒకదానిని మించేలా మరొకటి తీస్తుంటారని, అలా అని అందరూ రాజమౌళిలు కాలేరని, కానీ కథ, కథనాలపై గట్టిగా శ్రద్ధ పట్టి ప్రశాంత్ కనుక ఎన్టీఆర్ సినిమా విషయమై మరింత కేర్ తీసుకుంటే, తన కెజిఎఫ్ సినిమాలను మించేలా ఆ మూవీని కూడా తీయవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా, ఈ విధంగా కెజిఎఫ్ సినిమాల అనంతరం ప్రశాంత్ తో చేయబోయే సినిమాతో ఎన్టీఆర్ ఒకింత పెద్ద రిస్క్ చేస్తున్నాడని, ఒకవేళ అది ఏ మాత్రం కాస్త అటు ఇటై, అంచనాలు అందుకోకపోతే మాత్రం పరిస్థితి తల్లక్రిందులే అని అంటున్నారు. మరి వీరిద్దరి కాంబోలో ఏ రేంజ్ హిట్ మూవీ వస్తుందో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: