ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో డాన్స్ షోలు  ప్రసారం అవుతున్నప్పటికీ ఎన్నో ఏళ్ల నుంచి విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న డాన్స్ రియాలిటీ షో 'ఢీ' ఛాంపియన్స్ కి  మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. దాదాపు కొన్నేళ్ల నుంచి ఎంతో విజయవంతంగా 'ఢీ' షో   కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ ఢీ షో లో కంటెస్టెంట్ గా వచ్చిన వారు ప్రస్తుతం డాన్స్ మాస్టర్ గా మారిపోయారు. అంతే కాదు ఎంతో మంది డాన్సర్లు కు లైఫ్ ఇచ్చింది. ఇప్పటికే ఎంతోమంది అప్  కమింగ్ డాన్స్ మాస్టర్ లు కూడా ఈ షో ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ కూడా 'ఢీ' షో ద్వారానే గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.



 ఇక ప్రస్తుతం 'ఢీ' ఛాంపియన్స్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఒకప్పుడు డాన్స్ తో మాత్రమే అదరగొట్టేది  ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్లో కూడా ఎక్కడా తక్కువ కాదు అని నిరూపిస్తుంది. ఏకంగా కామెడీ షో కాదు అంతకు మించి అనే రేంజ్ లో ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ తో కూడా అలరిస్తుంది 'ఢీ' షో. ఓ వైపు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లతో మైమరిపిస్తునే  మరోవైపు ఆకట్టుకునే కామెడీ స్కిట్ లతో కూడా అందరిని నవ్విస్తుంది అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం 'ఢీ' ఛాంపియన్స్ కాస్త చివరి అంకానికి చేరుకుంది. ఇటీవలే గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలవ్వగా ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.




 ఇక గ్రాండ్ ఫినాలే ని 'ఢీ' షో నిర్వాహకులు అందరూ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు. 'ఢీ' షో మొదలైన మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ లు  గా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మాస్టర్స్ అందరి తో 'ఢీ' షో మొత్తం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే.. మహానటి సినిమా లోని ప్రోమో సాంగ్ లో  పర్ఫామెన్స్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి. అదిరిపోయే డ్యాన్స్ చేస్తూనే మరో వైపు ముఖం లో ఎక్స్ప్రెషన్స్ పలికించి ప్రోమో చూస్తుండగానే గూస్బమ్స్  తెప్పించేలా పర్ఫామెన్స్ చేయడం ప్రస్తుతం అందరినీ తెగ ఆకర్షిస్తుంది ఈ పర్ఫామెన్స్ కోసం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు  ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: