ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రిట్రో ప్రేమకథగా దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా తొలిసారిగా పూజా హెగ్డే నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ని, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెలుగు సహా పలు ఇతర భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ ఖర్చుతో గోపికృష్ణ మూవీ, యువి క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ప్రభాస్ సహా పలువురు ఇతర నటులపై కీలక యాక్షన్ సీన్స్ ని మూవీ యూనిట్ తీస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళి శర్మ, జయరామ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నట్లు టాక్. ఇక ఇటీవల బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి ప్రేక్షకాభిమానులు నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాకి సరిగ్గా సంక్రాంతి పండుగ రోజున గుమ్మడికాయ కొట్టనుందట మూవీ యూనిట్. కేవలం సినిమాకి సంబంధించి కొన్ని యాక్షన్ సీన్స్, రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నట్లు చెప్తున్నారు. వాటిని కూడా సంక్రాంతి సమయానికి పూర్తి చేసి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వేసవి కానుకగా రిలీజ్ చేయాలని రాధేశ్యామ్ యూనిట్ పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది నిజంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్త అని చెప్పకతప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: